భారతదేశం, మే 21 -- Drishyam 3: మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతీయ సినీ రంగంలోనే ఒక క్లాసిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకున్న మూవీ 'దృశ్యం'. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్, మీనా ప్రధాన పాత్రల్లో వచ్చిన 'దృశ్యం' (2013), 'దృశ్యం 2' (2021) చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి.

ఇప్పుడు అదే సిరీస్‌లో భాగంగా వచ్చిన 'దృశ్యం 3' గురువారం (మే 21) థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. అయితే కొందరు సినిమాలోని సస్పెన్స్ ఎలిమెంట్స్‌ను సోషల్ మీడియాలో పెట్టేస్తుండటంతో చిత్ర యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

సినిమా విడుదలైన కాసేపటికే నటి మీనా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రేక్షకులకు, మోహన్ లాల్ అభిమానులకు ఒక సున్నితమైన విన్నపం చేశారు.

"ప్రియమైన సినీ ప్రేమికులకు, అభిమానులకు నాదొక చిన్...