భారతదేశం, మే 30 -- Divyendu: ఇండియాలో మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో రామ్ చరణ్ 'పెద్ది' ఒకటి. ఈ మూవీతో బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు గ్లోబల్ స్టార్ చరణ్ బరిలో దిగబోతున్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 4న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పెద్ది నటుడు దివ్యేందు శర్మ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

పెద్ది సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు దివ్యేందు శర్మ. మీర్జాపూర్ సిరీస్ లో మున్నాభాయ్ గా సినీ లవర్స్ కు దివ్యేందు సుపరిచితమే. ఇప్పుడు పెద్దిలో విలనిజం పండించనున్నాడు. పెద్ది రిలీజ్ దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్లలో వేగం పెంచింది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో దివ్యేందు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

''పెద్ది మూవీ షూటింగ్ స్టార్ట్ చేయకముందు సౌత్ ఇండియా సినిమాలపై మీ అభిప్రాయం ఏంటీ'' అని ఇంటర్వ్యూలో ద...