భారతదేశం, సెప్టెంబర్ 15 -- Disha Patani Trolling: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ మరోసారి వార్తల్లో నిలిచారు. ముంబైలో అంబానీ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించిన గణేష్ చతుర్థి 2026 వేడుకల్లో ఆమె వేసుకున్న బోల్డ్ అవుట్‌ఫిట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. వినాయక దర్శనం కోసం లో-కట్ బ్లౌజ్, రెడ్ లెహంగాలో వచ్చిన దిషాను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

వినాయక చవితి పండగ సందర్భంగా ముంబైలోని అంబానీ నివాసంలో జరిగిన గణపతి పూజకు బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ వేడుకకు దిశా పటానీ రెడ్ కలర్ ఎంబ్రాయిడరీ ఘాగ్రా, డీప్-కట్ బ్లౌజ్ వేసుకొని వచ్చారు.

ఒంటిపై ఎర్రటి దుపట్టాతో పాటు హెవీ ఇయర్ రింగ్స్, గాజులతో మెరిసిపోతూ మీడియా కెమెరాలకు పోజులిచ్చారు. అయితే ఈ వీడియోలు సోషల్ మీడియాలోకి రాగానే నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దేవుడ...