భారతదేశం, జూలై 24 -- Dia Mirza Slams PM Narendra Modi: దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలు, సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించిన తీరుపై ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని సందేశంలో బాధితుల పట్ల ఎలాంటి మానవీయ స్పందన లేదని ఆక్షేపించారు.

ప్రధాని మోదీ శుక్రవారం (జూలై 24) విడుదల చేసిన వీడియో సందేశంపై దియా మీర్జా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. ఈ సంక్షోభం కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు, శోకసంద్ర...