భారతదేశం, మార్చి 21 -- బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన గూఢచారి యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే భారత్‌లో రూ. 250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

అయితే, ఇండియా సరిహద్దు దేశమైన పాకిస్థాన్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో ధురంధర్ 2 సినిమాపై నిషేధం విధించారు. కానీ, ఏ నిషేధాలు అడ్డుకోలేని విధంగా పాక్ ప్రజలు ఈ సినిమాను చూసేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు.

లాహోర్‌కు చెందిన ఖలీద్ మెహమూద్ అనే పాక్ జర్నలిస్ట్ తన ఇంట్లోని టీవీలో 'ధురంధర్ 2' సినిమా చూస్తున్నట్లు ఒక వీడియోను ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో రణ్‌వీర్ సింగ్‌కు సంబంధించిన ఒక కీలకమైన సీన్ ప్లే అవుతోంది.

"లాహోర్‌లో ధురంధర్ 2 చూస్తున్నాను" అంటూ పాకిస్థాన్ జర్నలిస...