భారతదేశం, మార్చి 27 -- ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్ హీరోగా వచ్చిన 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ మూవీ రూ.1,000 కోట్ల క్లబ్‌లో చేరి అదరగొట్టింది.

అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2' ఆరు రోజుల్లోనే రూ.1,000 కోట్లు వసూలు చేయగా, ధురంధర్ 2 ఎనిమిది రోజుల్లో ఆ ఘనత సాధించింది. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ 'పఠాన్', ప్రభాస్ 'కల్కి 2898 AD' వంటి భారీ చిత్రాల రికార్డులను ధురంధర్ 2 సినిమా అధిగమించింది.

మార్చి 19న విడుదలైన ధురంధర్ 2 మూవీ మొదటి మూడు రోజుల్లో ప్రతిరోజూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో ఓపెనింగ్ వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

వీక్ డేస్‌లో కూడా ధురంధర్ 2 సినిమా తన ...