భారతదేశం, మార్చి 21 -- బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన 'ధురంధర్ ద రివెంజ్' బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. మొదటి రోజే పాత రికార్డులన్నీ బద్దలు కొట్టిన ఈ సినిమా, రెండో రోజు కూడా అదే జోరు చూపించింది. థియేటర్లలో ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్నప్పటికీ, జనాలు కదలకుండా కూర్చుని ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో రెండు రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.331 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ధురంధర్ 2 సినిమా కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా రూ.331 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు sacnilk.com వెల్లడించింది. ఇక ఇండియాలో ఈ గ్రాస్ వసూళ్లు రూ.267 కోట్లుగా ఉండగా.. ఓవర్సీస్ లో మరో రూ.64 కోట్లు వచ్చాయి. శని, ఆదివ...