భారతదేశం, జూలై 9 -- ల్యాప్‌టాప్ స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చోవడం, ఒక మీటింగ్ తర్వాత మరో మీటింగ్, పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్లు, డెడ్‌లైన్లు.. నేటి కార్పొరేట్ ఉద్యోగుల దినచర్య అంతా ఇలాగే సాగుతోంది. ఐటీ నగరాలైన హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో డెస్క్ జాబ్స్ చేసేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ఈ తరహా జీవనశైలి వల్ల శరీరంపై పడే దుష్ప్రభావాలు అంతా ఇంతా కాదు. చాలామందిలో ఈ అలవాటు నిశ్శబ్దంగా వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. అసలు రోజుకు ఎన్ని గంటలు కూర్చోవచ్చు? ఎంతసేపటికొకసారి శరీరాన్ని కదిలించాలి? అనే సందేహాలు చాలామందిలో తలెత్తుతుంటాయి.

దీనిపై గ్లెనెగల్స్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ నవీన్ పీ రెడ్డి కీలక విషయాలను పంచుకున్నారు. సుదీర్ఘకాలం పాటు ఒకే చోట కదలకుండా కూర్చోవడం వల్ల కలిగే అనర్థాలను, వాటిని ఎలా నివ...