భారతదేశం, ఆగస్టు 11 -- కొలంబియా దేశాన్ని భారీ భూకంపం కుదిపేసింది. ఈ పెను విపత్తులో ఇప్పటివరకు కనీసం 111 మంది ప్రాణాలు కోల్పోగా, డజన్ల కొద్దీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. శిథిలాల కింద ఇంకా అనేక మంది చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. సహాయక చర్యలను వేగవంతం చేయడానికి ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిందని వివరించారు.

పశ్చిమ కొలంబియాలో, స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:34 గంటలకు రిక్టార్​ స్కేలుపై 7.4 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దీనితో అక్కడ పరిస్థితులు దయనీయంగా మారాయి.

పలు నగరాల్లో క్షతగాత్రుల కోసం రెస్క్యూ టీమ్‌లు తీవ్రంగా గాలిస్తున్నాయి.

"ప్రాణాలను రక్షించడానికి, బాధితులను ఆదుకోవడానికి, అవసరమైన ప్రతి ప్రాంతానికి సహాయం అందించడానికి మా...