భారతదేశం, మే 10 -- Vijay : చెన్నైలో ఆదివారం అట్టహాసంగా జరిగిన వేడుకలో 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) అధినేత సీ జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన తన రాజకీయ చిత్తశుద్ధిని చాటుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు దిశగా మూడు అత్యంత కీలకమైన దస్త్రాలపై తొలి సంతకాలు చేశారు.

టీవీకే అధినేత విజయ్ తన మొదటి ఉత్తర్వు ద్వారా తమిళనాడు ప్రజలకు మూడు ప్రధాన వరాలను ప్రకటించారు:

ఉచిత విద్యుత్: రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా సరఫరా చేయాలని ఆదేశించారు.

మాదకద్రవ్యాల నిర్మూలన: రాష్ట్రంలో డ్రగ్స్ బెడదను అరికట్టేందుకు ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ సంతకం చేశారు.

మహిళా రక్షణ: మహిళల భద్రత కోసం ప్రత్యేక రక్షణ దళంతో పాటు 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్ వ్యవస్థను అం...