భారతదేశం, జూన్ 29 -- CM Chandrababu District Tours :రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఈ టూర్ సాగనుంది. జులై 1వ తేదీ నుండి జులై 5వ తేదీ వరకు ఐదు రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా పరిధిలోని నాలుగు కీలక జిల్లాల్లో ఆయన విస్తృతంగా పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా నెల్లూరు, తిరుపతి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రతిష్టాత్మక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అంతేకాకుండా పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందజేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి అధికారిక పర్యటన షెడ్యూల్ వివరాలను ప్రభుత్వం సోమవారం వెల్లడించింది.

పర్యటనలో మొదటి రోజైన జులై 1న ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లాలో అడుగుపెడతారు. జిల్లాలోని చిల్లాకూరు మండలంలో ప్రతిష్టాత్మకంగా...