భారతదేశం, ఏప్రిల్ 22 -- Chitti babu Death: దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా తెలుగు సినీ పరిశ్రమంలో తనదైన ముద్ర వేసిన చిట్టి బాబు మరణించారు. చిట్టి బాబు అలియాస్ త్రిపురనేని వరప్రసాద్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మృతి చెందారు. దీంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది.

ప్రముఖ సీనియర్ దర్శక నిర్మాత, నటుడు, విశ్లేషకుడు చిట్టి బాబు ఇక లేరు. ఛాతి నొప్పి రావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పటిల్ కు మంగళవారం రాత్రి చిట్టి బాబును తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారనే విషయాన్ని డాక్టర్లు కన్ఫామ్ చేశారు. దీంతో చిట్టి బాబు మృతికి సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

చిట్టి బాబు తండ్రి త్రిపురణేని మహారథి ప్రముఖ రచయిత. చిట్టి బాబు కృష్ణా జిల్లాలోని కాజ గ్రామంలో పుట్టారు. సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గ...