భారతదేశం, జూన్ 23 -- Chiranjeevi Samantha: సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక కమర్షియల్ సినిమా సక్సెస్ కావడం వేరు, ఒక లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ ఫిల్మ్ కేవలం మూడు రోజుల్లోనే రూ.43 కోట్లకు పైగా గ్రాస్ సాధించడం వేరు. సమంత (Samantha) బ్రేక్ తర్వాత సరికొత్త ఎనర్జీతో రీఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రం 'మా ఇంటి బంగారం' ఇప్పుడు థియేటర్లలో అదరగొడుతోంది. తాజాగా మూవీ యూనిట్ ను మెగాస్టార్ అభినందించడం వైరల్ గా మారింది.

మంచి సినిమాను ఎంకరేజ్ చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. తాజాగా మా ఇంటి బంగారం చిత్రం బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ కు చిరంజీవి, సురేఖ దంపతులు ఫిదా అయ్యారు. హీరోయిన్ సమంత, రాజ్ నిడిమోరు, డైరెక్టర్ నందిని రెడ్డిని ఇంటికి పిలిపించుకొని మరీ ప్రశంసించారు.

ఈ సందర్భంగా చిరంజీవి, సురేఖ దంపతులు చిత్ర యూనిట్‌ను శాలువాలతో సత...