భారతదేశం, జూలై 26 -- Chiranjeevi: కష్టాల్లో ఉన్న సినీ కార్మికులకు, తోటి నటులకు ఆపద్బాంధవుడిగా నిలవడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. తాజాగా తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న నటుడు రమేష్‌కు చిరంజీవి అండగా నిలిచారు.

గబ్బర్ సింగ్ సినిమాలో రౌడీ గ్యాంగ్ లో నటించి పేరు సంపాదించుకున్న నటుడు రమేష్. అతను ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో చిరంజీవి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. రమేష్ అత్యవసర వైద్య ఖర్చుల కోసం మెగా కుటుంబం నుంచి భారీ ఆర్థిక సాయం లభించింది.

నటుడు రమేష్ హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై అపోలో ఆసుపత్రిలో చేరినట్లు తెలిసిన వెంటనే చిరంజీవి తక్షణమే స్పందించారు. అపోలో ఆసుపత్రి ప్రముఖ వైద్యుడు డాక్టర్ సుబ్బా రెడ్డితో ఆయన మాట్లాడారు.

రమేష్ ఆరో...