భారతదేశం, మే 19 -- Chinmayi Sripaada: మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జరిగిన ట్విషా శర్మ (33) అనుమానాస్పద మృతి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. అత్తవారింటి వరకట్న వేధింపులే ఆమె మరణానికి కారణమని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) రంగంలోకి దించారు. ఈ విషాదంపై గాయని, సామాజిక కార్యకర్త చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' ద్వారా అత్యంత ఘాటుగా స్పందించారు.

ట్విషా శర్మ మృతిపై చిన్మయి చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. భారతీయ సమాజంలో పెళ్లి పేరిట అమ్మాయిలను చూసే కోణాన్ని ఆమె తీవ్ర పదజాలంతో నిలదీశారు.

"ట్విషా మరణం ఒక చేదు నిజాన్ని స్పష్టం చేస్తోంది. భారతదేశంలో చాలా మంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను అత్తవారింటి...