భారతదేశం, మార్చి 15 -- కవి, రచయిత వైరముత్తు ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. దేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారం అందుకున్న మూడవ తమిళ రచయితగా ఆయన నిలిచారు. అయితే మీటూ ఉద్యమంలో వైరముత్తుపై ఆరోపణలు చేసిన చిన్మయి శ్రీపాద ఇప్పుడు ఫైర్ అవుతోంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వైరముత్తుకు అవార్డు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తోంది.

వైరముత్తుకు జ్ఞానపీఠ్ పురస్కారం రావటం పట్ల కోలీవుడ్ హర్షం వ్యక్తం చేస్తోంది. తమిళ దిగ్గజ నటులు కమల్ హాసన్, రజినీకాంత్ తదితరులు వైరముత్తుకు అభినందనలు తెలిపారు. ఈ సెలబ్రిటీలందరిపై చిన్మయి శ్రీపాద ఫైర్ అవుతోంది. తాజాగా రజినీకాంత్ నూ వదలకుండా కౌంటర్ వేసింది.

వైరముత్తుకు రజినీకాంత్ అభినందనలు తెలుపుతూ ఎక్స్ లో పోస్టు పెట్టారు. తమిళంలో ఇలా రాసుకొచ్చారు. "మా భారత జాతి గొప్ప జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, నా ప్రియమ...