భారతదేశం, మార్చి 14 -- తమిళ రచయిత వైరముత్తు కు జ్ఞాన‌పీఠ్‌ పురస్కారం లభించింది. శనివారం (మార్చి 14) అతణ్ని ఈ అవార్డుకు ఎంపిక చేస్తూ కమిటీ పేరు ప్రకటించింది. అయితే దీనిపై ఓ వైపు తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి పురస్కారం ఎలా ఇస్తారంటూ సింగర్ చిన్మయి శ్రీపాద ఫైర్ అయింది. అభినందించిన కమల్ హాసన్ పైనా ఆమె మండిపడింది.

వైరముత్తుకు జ్ఞాన‌పీఠ్‌ పురస్కారం రావడంపై సింగర్ చిన్మయి శ్రీపాద ఫైర్ అయింది. ఎక్స్ లో తన కోపాన్ని వెళ్లగక్కింది. "2018లో వివిధ వయసు మహిళలు ఒక కవి, రచయిత (వైరముత్తు) తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. గతంలో తన తండ్రి పేరుతో వైరముత్తును ప్రశంసిస్తూ వెలువడ్డ లేఖ నకిలీదని జయకాంతన్ కూతురు కూడా చెప్పింది. ఈ రోజు అలాంటి వ్యక్తికి జ్ఞాన‌పీఠ్‌ పురస్కారం దక్కింది'' అ...