భారతదేశం, మే 1 -- CBSE results 2026 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న 10.2 లక్షల మంది విద్యార్థులకు కీలక సమాచారం అందింది. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు జరిగాయి. పరీక్షలు ముగిసిన వెంటనే మూల్యాంకన ప్రక్రియను బోర్డు వేగవంతం చేసింది. ప్రస్తుతం ఫలితాల ప్రాసెసింగ్ తుది దశకు చేరుకుంది. గత ఏడాది మే రెండో వారంలోనే ఫలితాలు వచ్చినప్పటికీ, ఈసారి స్వల్ప జాప్యం జరిగి మే మూడో వారంలో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి!

కొత్తగా ప్రవేశపెట్టిన సిస్టమ్‌లో సాంకేతిక లోపాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను సీబీఎస్‌ఈ పరీక్షల నియంత్రణాధికారి సన్యం భరద్వాజ్ ఖండించారు. పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన.. "ఫలితాల ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయనే వార్తల్లో నిజం లేద...