భారతదేశం, మార్చి 27 -- దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాలపై ఒక వార్త బయటకు వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఏప్రిల్ మధ్య నాటికే ఫలితాలను ప్రకటించేందుకు బోర్డు కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. సాధారణంగా మే నెలలో వచ్చే ఫలితాలు, ఈసారి సెకండ్ బోర్డ్ ఎగ్జామ్స్ దృష్ట్యా ముందుగానే విడుదల అవుతాయని సమాచారం.

ఈ ఏడాది ఫిబ్రవరి 17న ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు మార్చి 11న ముగిశాయి. కాగా ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయిందని, ప్రస్తుతం ఉపాధ్యాయులు మార్కుల పునఃపరిశీలన (రీ- వెరిఫికేషన్) చేస్తున్నారని తెలుస్తోంది.

సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు గతేడాది మే 13న ఫలితాలు విడుదలవ్వగా, ఈసారి ఏప్రిల్ 15 లోపు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఫలితాలు విడుదలైన వెంటనే వ...