భారతదేశం, ఏప్రిల్ 14 -- Redmi A7 Pro price in India : బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ విభాగంలో పోటీని పెంచుతూ షావోమీ తన తాజా మోడల్ రెడ్​మీ ఏ7 ప్రో 5జీని ఇటీవలే భారత్‌లోకి తీసుకొచ్చింది. కేవలం ధర మాత్రమే కాకుండా, ఈ ఫోన్‌లో అందించిన బ్యాటరీ సామర్థ్యం, లాంగ్ టర్మ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇప్పుడు టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఈ మొబైల్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

రెడ్‌మీ ఏ7 ప్రో 5జీ స్మార్ట్​ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది:

4 జీబీ + 64 జీబీ: రూ. 11,499

4 జీబీ + 128 జీబీ: రూ. 12,499

ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 15 నుంచి అమెజాన్, షావోమీ అధికారిక వెబ్‌సైట్లలో విక్రయానికి రానుంది. మిస్ట్ బ్లూ, బ్లాక్, సన్‌సెట్ ఆరెంజ్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.

ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 6.9- ఇంచ్ భారీ ఎల్​సీడీ డిస్​ప్ల...