భారతదేశం, ఫిబ్రవరి 1 -- కేంద్ర బడ్జెట్ 2026 ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తూనే, సామాన్యులు, పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గించేలా కస్టమ్స్ సుంకాలలో మార్పులు చేశారు. దీనివల్ల నిత్యావసర మందులు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గనుండగా, విలాస వస్తువుల ధరలు పెరగనున్నాయి.

బడ్జెట్ ప్రతిపాదనల తర్వాత ఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయి? ఏవి పెరగనున్నాయి? అనే పూర్తి జాబితా ఇక్కడ చూడండి..

సామాన్యులకు, విద్యార్థులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం ఈ బడ్జెట్​ 2026లో ఈ కింది వస్తువులపై పన్నులు/సుంకాలను తగ్గించింది:

వైద్యం: 17 రకాల క్యాన్సర్, అరుదైన వ్యాధుల మందులపై కస్టమ్స్ సుంకం రద్దు.

ఎలక్ట్రానిక్స్: మొబైల్ ఫోన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, దేశీయంగా తయారైన టీవీ పరికర...