భారతదేశం, జూలై 10 -- భారతదేశంలో టెలికాం నెట్‌వర్క్ ఎంతో విస్తరిస్తున్నప్పటికీ.. కొన్ని కొండ ప్రాంతాలు, లోతైన లోయలు, దట్టమైన అడవులు, సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికీ సాధారణ మొబైల్ సిగ్నల్స్ దొరకడం గగనంగానే మారుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు లేదా నల్లమల అడవుల్లోకి వెళ్లేటప్పుడు కూడా ఈ సిగ్నల్ సమస్యలను మనం గమనిస్తూనే ఉంటాము. ఇలాంటి నెట్‌వర్క్ లేని మారుమూల ప్రదేశాల్లో చిక్కుకుపోయినప్పుడు ప్రపంచంతో సంబంధాలు తెగిపోకుండా ఉండేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్​ఎన్​ఎల్) ఒక అద్భుతమైన పరిష్కారాన్ని ముందుకు తెచ్చింది. గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ 'బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్'ని మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ అత్యాధునిక హ్యాండ్‌సెట్ అంతర్జాతీయ ఉపగ్రహ దిగ్...