భారతదేశం, మార్చి 21 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో సుభాష్ ను అడ్డం పెట్టుకొని రేఖ తన పంతం నెగ్గించుకుంటుంది. ఇక ఎప్పుడూ అపర్ణ తనకు ఎదురు చెప్పకుండా తాను వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. మరోవైపు రాజు మెల్లగా తన వాళ్లకు దగ్గరయ్యేలా గతం గుర్తుకు రావడం మొదలైనట్లు చివర్లో వచ్చిన సీన్ చూస్తే అర్థమవుతోంది.

బ్రహ్మముడి సీరియల్ శనివారం (మార్చి 21) ఎపిసోడ్ సుభాష్ కు యాంటీ డోట్ ఇవ్వాలని రేఖను ఇందు వేడుకునే సీన్ తో మొదలవుతుంది. డాక్టర్ ద్వారా ఏదో ఇంజెక్షన్ ఇప్పించి అతనికి ఊపిరి ఆడకుండా చేసిన రేఖ.. ఆ యాంటీ డోట్ తన దగ్గరే ఉందని, కానీ తాను ఇవ్వనని అంటుంది. దీంతో ఇందు ఆమెను ప్రాధేయపడుతుంది. దీంతో అది ఇంట్లోనే ఉందని చెబుతుంది.

మొదట తన గదిలో ఉంది వెళ్లి తెచ్చుకోమని ఇందుకి చెబుతుంది. ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి అక్కడ చూసిన దొరకదు. మళ్లీ రేఖ దగ్గరకి వస్...