భారతదేశం, ఆగస్టు 3 -- Bhumi Pednekar On PM Modi: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ (NEET-UG) ప్రవేశ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనలు తీవ్ర రూపాంతరం దాల్చాయి. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నెల రోజులకు పైగా సాగిన ఈ నిరసనలు, జులై 20న సంసద్ మార్చ్ సందర్భంగా మరింత ఉద్రిక్తంగా మారాయి.

ఈ నేపథ్యంలో నిరసనల్లో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు వాడిన భాషపై బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె ట్రోలింగ్‌కు గురయ్యేలా చేశాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు భూమిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేసిన భూమి పెడ్నేకర్, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కొందరు యువకులు వాడిన భాషే సరికాదని అభిప్రాయపడ్డారు.

"సోషల్...