భారతదేశం, మార్చి 21 -- తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రాథమికంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం కాగా.. సీఎం సూచనల తర్వాత తుది రూపు ఇవ్వనున్నారు. ఆగ‌మ శాస్త్రం ప్ర‌కార. మొత్తం మూడు ద‌శల్లో ఆల‌యాన్ని అభివృద్ది చేయనున్నారు.

భద్రాచలం ఆలయ రూపురేఖలను మార్చేలా రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై శుక్ర‌వారం సచివాల‌యంలోని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కార్యాల‌యంలో స‌మావేశం నిర్వ‌హించారు. ఇందుకు జిల్లా మంత్రులు తుమ్మలతో పాటు పొంగులేటి కూడా హాజరయ్యారు. భద్రాద్రిని ఒక అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉందని మంత్రులు వెల్లడించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. 200 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని ఆగ‌మ శాస్త్రం ప్ర‌కారం భ‌క...