భారతదేశం, మార్చి 7 -- శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.

మార్చి 27వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా సీతారాములకు వార్షిక కల్యాణం చేస్తారు. అత్యంత వైభవంగా నిర్వహించే క్రతువును భక్తులు వీక్షించేందుకు వీలుగా సెక్టార్‌ (విభాగం)లను ఏర్పాటు చేశారు. ఈ టికెట్లను బుకింగ్ చేసుకునేందుకు వీలుగా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు. ఈ మేరకు దేవాదాయశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ టికెట్లను భద్రాచలం రామాలయం అధికారిక వెబ్‌సైట్‌ https://bhadradritemple.telangana.gov.in/ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఇవాళ్టి నుంచే ఈ అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లిన తర్వతా హోం పేజీలోని శ్రీరామనవమి టికెట్ లింక్ పై క్లిక్ చే...