భారతదేశం, ఆగస్టు 27 -- ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో మునుపెన్నడూ లేని విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది! నగరాల్లో, పట్టణాల్లో కొత్త బ్యాంక్ బ్రాంచీలు వెలుస్తూనే ఉన్నప్పటికీ, బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య మాత్రం తగ్గిపోతోంది. 2025-26 (ఎఫ్​వై26) ఆర్థిక సంవత్సరంలో దేశంలోని నాలుగు ప్రధాన ప్రైవేట్ బ్యాంకులు-ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా కలిసి ఏకంగా 13,000 మంది ఉద్యోగులను తగ్గించుకున్నాయి. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఐటీ రంగానికి సమానంగా బ్యాంకింగ్ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఈ గణాంకాలు ఉద్యోగార్థులను ఆలోచనలో పడేస్తున్నాయి.

ఉద్యోగుల సంఖ్య తగ్గుదలలో ఐసీఐసీఐ బ్యాంక్ మొదటి స్థానంలో నిలిచింది. 2026 మార్చి 31 నాటికి ఈ బ్యాంకులో శాశ్వత ఉద్యోగుల సంఖ్య 5,148 తగ్గి 1,24,029కి చేరింది. తాత్కాలిక సిబ్బంద...