భారతదేశం, మే 11 -- Bandi Bhagirath POCSO Case : కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై నమోదైన కేసుపై తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. ఈ నెల 8వ తేదీనే ఫిర్యాదు అందినప్పటికీ.. నిందితుడిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు.

డీజీపీ సీవీ ఆనంద్ ఈ కేసులోని పూర్వాపరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసు బలగాలన్నీ భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాయని.. ఆ కారణం చేతనే కేసు దర్యాప్తులో కొంత జాప్యం జరిగిందని డీజీపీ ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు.

అయితే ఈ వివరణపై స్పందించిన ముఖ్యమంత్రి.. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని సమగ్ర వి...