భారతదేశం, మే 14 -- పోక్సో (POCSO) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేసింది. ఈ కేసులో తక్షణ అరెస్ట్ నుంచి ఆయనకు ఊరట లభిస్తుందా లేదా అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

బండి భగీరథ్ తరపు న్యాయవాదులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తాజాగా విచారించింది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, పూర్తిస్థాయి విచారణను వారం రోజుల తర్వాత చేపడతామని స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్‌పై వచ్చే వారం విచారణ చేస్తామని తెలిపింది. మధ్యంతర బెయిల్‌పై తీర్పును మే 15వ తేదీన వెల్లడిస్తామని చెప్పింది.

ప్రధాన బెయిల్ పిటిషన్ విచారణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున, అంతవరకు తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా మధ్యంతర బెయిల్ కల్పించాలని భగీరథ్ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. కోర్టు తుది తీర్పు ఇచ్చే ...