భారతదేశం, జూన్ 25 -- Ayodhya Donation Scam: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగం ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. రామాలయానికి భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల ఫండ్స్ గోల్‌మాల్ అయ్యాయనే ఆరోపణలపై అధికారికంగా ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది.

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు ఆధారంగా అయోధ్య పోలీసులు ఈ కేసు ఫైల్ చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైలెవెల్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) విచారణ జరుపుతున్న టైమ్‌లోనే ఈ లీగల్ యాక్షన్ మొదలు కావడం రాజకీయంగా పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

ఈ నెల ప్రారంభంలోనే రామ్ మందిర్ విరాళాలు దుర్వినియోగం అయ్యాయంటూ కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. దీంతో ఆలయ ట్రస్ట్ విజ్ఞప్తి మేరకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వెంటనే సిట్...