భారతదేశం, మార్చి 3 -- ముంబై వేదికగా అట్టహాసంగా జరిగిన 'జీ సినీ అవార్డ్స్ 2026' వేడుక ఇప్పుడు ఒక కొత్త వివాదానికి తెరలేపింది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన 'తేరే ఇష్క్ మే' చిత్రంలో నటనకు గాను కృతి సనన్ 'ఉత్తమ నటి' (ఫీమేల్) పురస్కారాన్ని అందుకున్నారు. ఈ విజయంతో కృతి సనన్ అభిమానులు పండగ చేసుకుంటుంటే, మెజారిటీ నెటిజన్లు మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.

ఈ కేటగిరీలో కృతి సనన్‌తో పాటు యామీ గౌతమ్ (హక్), తృప్తి దిమ్రి (ధడక్ 2), సోనమ్ బజ్వా (ఏక్ దీవానే కీ దీవానియత్), కంగనా రనౌత్ (ఎమర్జెన్సీ), అనీత్ పడ్డా (సయ్యారా) వంటి వారు పోటీ పడ్డారు. వీరిలో 'హక్' చిత్రంలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న యామీ గౌతమ్ ఈ అవార్డుకు అన్ని విధాలా అర్హురాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సోషల్ మీడియా వేదికగా ఒక నెటిజన్ స్పందిస్తూ.. "హక్ సినిమాలో యామీ ...