భారతదేశం, జూన్ 29 -- Awarapan 2 Teaser: బాలీవుడ్ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆవారాపన్' క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. సరిగ్గా 19 ఏళ్ల తర్వాత అదే వైబ్, అంతకంటే డబుల్ ఎమోషన్స్, యాక్షన్‌తో 'ఆవారాపన్ 2' టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

లవర్ బాయ్, ఓజీ మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఇమ్రాన్ హష్మీ మరోసారి ఐకానిక్ క్యారెక్టర్ 'శివమ్ పండిట్'గా స్క్రీన్ పైకి వస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ కల్ట్ మూవీ సీక్వెల్ అనౌన్స్‌మెంట్ టీజర్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

ఈ ఆవారాపన్ 2 కొత్త టీజర్ చూస్తే ఫ్యాన్స్‌కు పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. మొదటి పార్ట్‌లో ఆలియా (శ్రియా శరణ్)ను కోల్పోయి, జీవితంపై విరక్తితో తిరిగే ఒక ఒంటరి పోరాట యోధుడిగా శివమ్ పండిట్ కనిపించాడు.

ఇప్పుడు పార్ట్ 2 లోనూ అదే బాధ కంటిన్యూ అవుతున్నట...