Auto Fare Hike : తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపునకు సిఫార్సు.. కొత్త రేట్లు ఇవే!
భారతదేశం, సెప్టెంబర్ 5 -- తెలంగాణలో ఆటో రిక్షాల ప్రయాణ ఛార్జీలను పెంచాలని రవాణా శాఖ నియమించిన అధికారుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు కొత్తగా ప్రతిపాదించిన రేట్లతో కూడిన నివేదికను రవాణా శాఖ కమిషనర్ డాక్టర్ కె. ఇలంబర్తి ఇటీవల ప్రభుత్వానికి సమర్పించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిన వెంటనే ఛార్జీల పెంపునకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
కనీస ఛార్జీ మొదటి 1.6 కిలోమీటర్ల దూరం వరకు కనీస ఛార్జీ రూ. 30. మొదటి 1.6 కి.మీ. దాటిన తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ. 14. వెయిటింగ్ ఛార్జీలు నిమిషానికి 75 పైసలు. రాత్రి వేళల్లో సాధారణ ఛార్జీ కంటే 50 శాతం సర్ఛార్జ్ అదనంగా ఉంటుంది.
గడిచిన 12 ఏళ్లుగా రాష్ట్రంలో ఆటో ఛార్జీల్లో ఎలాంటి మార్పు చేయలేదని, అందుకే ప్రస్తుతం ఛార్జీలను పెంచడం అనివార్యమని కమిటీ తన నివేదికల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.