భారతదేశం, సెప్టెంబర్ 14 -- విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి స్థిరపడాలని కలలు కనే భారతీయ, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం బిగ్ షాక్ ఇస్తోంది. గడిచిన పదేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను తిరస్కరిస్తోంది. విద్యార్థి వీసా నిబంధనలను అత్యంత కఠినతరం చేయడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఆస్ట్రేలియా హోం వ్యవహారాల శాఖ వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం.. 2026 జూన్ నాటికి విద్యార్థి వీసాల తిరస్కరణ రేటు 24.2 శాతానికి చేరింది. పదేళ్ల క్రితం, అంటే 2016 జూన్‌లో ఈ తిరస్కరణ రేటు కేవలం 7.9 శాతం మాత్రమే ఉండేది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి వచ్చిన దరఖాస్తుల్లో ఏకంగా 40 శాతానికి పైగా ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరస్కరించడం కలకలం రేపుతోంది.

ఈ కొత్త కఠిన నిబంధనల ప్రభావం...