భారతదేశం, జూలై 28 -- అసోంను మళ్లీ వరద ముంచెత్తింది. శివసాగర్ నుంచి తిన్‌సుకియా వరకు 15 జిల్లాల్లో ప్రళయం సృష్టించిన ఈ వరదల కారణంగా ఇప్పటివరకు 68 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 5.25 లక్షల మంది ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చింది. బ్రహ్మపుత్రతో పాటు దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బందితో పాటు భారత సైన్యం కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నాయి.

వరదల దాటికి 6 జిల్లాలు అత్యంత ఘోరంగా దెబ్బతింది. ఈ జిల్లాల్లోనే దాదాపు 4.45 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రైల్వే ట్రాక్లు నీట మునిగిపోవడంతో పలు రైళ్లను రద్దు చేయడం లేదా మళ్లించడం చేశారు. తేయాకు తోటలు, పంట పొలాలు జలమయమయ్యాయి. గౌహతి సమీపంలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.

అయితే దాదాపు ప్రతి వర్షాకాలంలో...