భారతదేశం, సెప్టెంబర్ 14 -- Asia Cup 2026: టీమిండియా అదుర్స్ అనిపించింది. భారత అమ్మాయిల జట్టు మరోసారి సత్తాచాటింది. రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి ఆసియా కప్ లో ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో శ్రీలంకను చిత్తుచేసింది. అయితే ఫైనల్ ముగిసిన తర్వాత మైదానంలో హైడ్రామా చోటు చేసుకుంది.

ఆసియా కప్ 2026 ఫైనల్ పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు ఏకంగా 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు.

స్మృతి మంధాన 59 పరుగులు చేయగా, షెఫాలీ వర్మ 68 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 183/5 పరుగుల భారీ స్కోరు సాధించింది.

184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు కట్టడి చేశారు. శ్రీలంక కెప్...