భారతదేశం, సెప్టెంబర్ 13 -- కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్న అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడ్డారు! మానవాళికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి వేగాన్ని కాస్త తగ్గించాలంటూ ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడై చేసిన విజ్ఞప్తి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఎవరు ఊహించని విధంగా ఈ ప్రకటనకు ఓపెన్ ఏఐ సారథి సామ్ ఆల్ట్‌మాన్, ఎక్స్ఐఏఐ అధినేత ఎలాన్ మస్క్ పూర్తి మద్దతు తెలిపారు. పోటీ ప్రపంచంలో శత్రువులుగా భావించే ఈ ముగ్గురు పారిశ్రామికవేత్తలు ఒకే వేదికపైకి వచ్చి 'ఏఐకి బ్రేకులు వేయాలి' అని అభిప్రాయపడటం ఇప్పుడు ఐటీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

డారియో అమోడై తన వ్యక్తిగత వ్యాసంలో రాసిన వివరాలు ఏఐ సృష్టిస్తున్న ప్రమాదాలను ఎత్తిచూపాయి. ఏఐ మోడళ్లు తమకు ...