భారతదేశం, మార్చి 5 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం, సామాజిక చేరికను బలోపేతం చేయడానికి 'ఇంద్ర ధనస్సు' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ చొరవలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చి 18, 2026న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేస్తారు. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న RPWD చట్టం, 2016లోని సెక్షన్ 2 (ZC) కింద ఉన్న అర్హత కలిగిన అన్ని పీడబ్ల్యూడిలకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని విస్తరింపజేస్తామని ఏపీఎస్ఆర్టీసీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ సౌకర్యం ఐదు కేటగిరీల ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులలో అందుబాటులో ఉంటుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ...