భారతదేశం, సెప్టెంబర్ 19 -- ఇండియాలోని ఐఫోన్, యాపిల్ వాచ్ వినియోగదారులకు ఆసక్తికరమైన వార్త. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రజాదరణ పొందిన 'యాపిల్ పే' సేవలు ఎట్టకేలకు భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి! ఈ అక్టోబర్​లోనే భారత డిజిటల్ చెల్లింపుల మార్కెట్లోకి యాపిల్ పే అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ అందించిన వివరాల ప్రకారం.. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్​తో కలిసి ఈ సేవలను ప్రారంభించేందుకు యాపిల్ ప్రణాళికలు సిద్ధం చేసింది.

ప్రస్తుతం వెలువడిన కథనాల ప్రకారం.. యాపిల్ పే తొలుత యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి రానుంది. వీసా, మాస్టర్‌కార్డ్ నెట్‌వర్క్‌లపై పనిచేసే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను యాపిల్ వాలెట్​కు అనుసంధానించడం ద్వారా వినియోగదారులు నేరుగా దుకాణాల్లో...