భారతదేశం, జూలై 11 -- Andhrapradesh MBBS Seats : ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని రెండు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా మరో 100 ఎంబీబీఎస్ (MBBS) సీట్ల కేటాయింపునకు జాతీయ వైద్య కమిషన్ (NMC) ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించినట్లు రాష్ట్ర ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు జాతీయ వైద్య కమిషన్ ఈ అదనపు సీట్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు 75 సీట్లు, నెల్లూరులోని ఏసీఎస్ఆర్ (ACSR) ప్రభుత్వ వైద్య కళాశాలకు 25 సీట్లను అదనంగా కేటాయించారు.

మంత్రి సత్య కుమార్ యాదవ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. రాబోయే 2026-27 విద్యా సంవత్సరానికి గాను కడ...