భారతదేశం, మార్చి 21 -- రాష్ట్రంలో ఎక్కడా గృహ అవసరాలకు సంబంధించిన వంట గ్యాస్ కొరత లేదని పౌరసరఫరాలశాఖ స్పష్టం చేసింది. ప్రజల్లో అపోహలు, భయాందోళనలు కలిగించే వారిపై అప్రమత్తంగా ఉండాలని సంబంధిత శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజలకు సూచించారు.

రాష్ట్రంలో గ్యాస్ సరఫరాను మూడు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హెచ్పీసీఎల్ (IOCL, BPCL, HPCL) వంటి ప్రధాన ఆయిల్ కంపెనీలు సప్లై చేస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో కొందరు కావాలని గ్యాస్ సరఫరా విషయంలో ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా మాట్లాడుతున్నారు. దీనివల్ల ప్రజలు ఆందోళనకు గురై ఎక్కువ బుకింగ్స్ జరుపుతున్నారని మంత్రి నాదెండ్ల తెలిపారు.

గత వారం రోజుల్లో ఇలాంటి అపోహల వల్లనే అధికంగా బుకింగ్స్ జరిగాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని. ముఖ్యంగా గృహ అవసరాలకు ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా సాఫీగా గ్యాస్ సరఫరా చ...