భారతదేశం, ఫిబ్రవరి 25 -- రాజమండ్రిలో కల్తీ పాల ఘటన నేపథ్యంలో ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని జిల్లాలోని పలు పాల సేకరణ కేంద్రాలు, డెయిరీ ఫామ్‌ల వద్ద ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాలలో యూరియా, డిటర్జెంట్ వంటి హానికర పదార్థాలు కలుస్తున్నాయా అనే కోణంలో తనిఖీలు చేసి, పలు పాల శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాల వర్తకులు, పాల తయారీదారులు, నిల్వదారులు, హోల్ సేల్ వర్తకుల నుంచి నమూనాల సేకరిస్తామని ఐపీఎం డైరెక్టర్ నీలకంఠారెడ్డి వెల్లడించారు. వారివద్ద ఆధీకృత లైసెన్సులు ఉన్నాయా.? లేవా అన్న వాటిపై తనిఖీల్లో గుర్తించనున్నామని వెల్లడించారు.

మరోవైపు రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనకు...