భారతదేశం, సెప్టెంబర్ 11 -- నకిలీ, కృత్రిమ, నాన్-డైరీ ఉత్పత్తులతో తయారుచేసే 'అనలాగ్ పనీర్' (Analogue Paneer) పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని అనలాగ్ పనీర్ ఉత్పత్తి, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, పంపిణీ, విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ తెలంగాణ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ అథారిటీ (TG SAFE) ప్రకటన విడుదల చేసింది. ఈ నిషేధం 2026 సెప్టెంబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి వచ్చి. ఒక ఏడాది పాటు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

సాధారణంగా మనం వాడే సాంప్రదాయ పనీర్ పాల ఉత్పత్తులతో తయారవుతుంది. కానీ 'అనలాగ్ పనీర్' అనేది పాలకు బదులుగా నాన్-డైరీ పదార్థాలు, కూరగాయల నూనెలు, స్టార్చ్, ఇతర రసాయనాలను ఉపయోగించి తయారుచేసే కృత్రిమ ప్రత్యామ్నాయం. చూడటానికి, పట్టుకుని చూడటానికి ఇది గట్టిదనంలోనూ, రూపంలోనూ సరి...