భారతదేశం, జూలై 16 -- Amazon Data Centre in Bharat Future City: హైదరాబాద్ శివార్లలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'భారత్ ఫ్యూచర్ సిటీ'లో మరో ముందడుగు పడింది. ప్రముఖ అంతర్జాతీయ సాంకేతిక సంస్థ అమెజాన్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే పదేళ్లలో.. అంటే 2034 నాటికి అమెజాన్ సంస్థ భారత్ ఫ్యూచర్ సిటీలో రూ.1 లక్ష కోట్ల భారీ పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.

"భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచంలోనే ఫార్చూన్ 500 కంపెనీల పెట్టుబడులను ఆహ్వానించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు. ఆ ప్రయత్నంలో భాగంగ...