భారతదేశం, మే 30 -- Ajith Mother: తమిళ చిత్ర పరిశ్రమ (కోలీవుడ్)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అగ్ర హీరో అజిత్ కుమార్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి మోహినీ మణి (84) వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యల కారణంగా శనివారం (మే 30) తెల్లవారుజామున చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆకస్మిక మరణంతో అజిత్ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.

తల్లి తుదిశ్వాస విడిచిన సమయంలో ఆమె బంధుమిత్రులు పక్కనే ఉన్నప్పటికీ, అజిత్ కుమార్ మాత్రం అప్పటికి దుబాయ్‌లో ఉన్నారు. తల్లి మరణవార్త విన్న వెంటనే తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆయన.. తన ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్‌ను అన్నీ పక్కనపెట్టి దుబాయ్ నుంచి హుటాహుటిన చెన్నైకి పయనమయ్యారు.

అంత్యక్రియలకు సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా వెలువడనప్పటికీ, ఇండస్ట్ర...