భారతదేశం, సెప్టెంబర్ 28 -- బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఏఐబీఈ -20 నోటిఫికేషన్ విడుదలైంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 29, 2025 నుంచి ప్రారంభం కానుంది. అర్హత ఉన్న అభ్యర్థులు allindiabarexamination.com వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఆన్ లైన్ దరఖాస్తులకు అక్టోబర్ 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అక్టోబర్ 31వ తేదీ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. నవంబర్ 15వ తేదీన హాల్ టికెట్లను విడుదల చేస్తారు. నవంబర్ 30వ తేదీన ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ పరీక్షా కేంద్రాలుంటాయి.

ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అనేది న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించాలనుకునే లా గ్రాడ్యుయేట్ల కోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి రెండుసార్లు సర్టిఫికేషన్ పరీక్షను నిర్వహిస్తుంది. పర...