భారతదేశం, నవంబర్ 16 -- ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామ్ -20 కి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. తాజాగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. నవంబర్ 30వ తేదీన దేశవ్యాప్తంగా ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ పరీక్షా కేంద్రాలున్నాయి.

ఆలిండియా బార్ ఎగ్జామినేషన్​లో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీస మార్కులు 40 శాతంగా ఉంది. సిలబస్ ప్రకారం AIBE 20లో 19 అంశాలు నుంచి ప్రశ్నలు వస్తాయి. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. మూడు గంటల సమయం ఉంటుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....