భారతదేశం, జూన్ 1 -- ప్రముఖ దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ 'కియా మోటార్స్' భారత మార్కెట్​లో తన ఈవీ పోర్ట్‌ఫోలియోను భారీగా విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. 2030 నాటికి దేశీయ మార్కెట్​లో 10 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలనే లక్ష్యంలో భాగంగా 8 ఎలక్ట్రిఫైడ్ (ఎలక్ట్రిక్/హైబ్రిడ్) వాహనాలను తీసుకురానుంది. ఇందులో కియా నుంచి రాబోతున్న అత్యంత చౌకైన, చిన్న ఎలక్ట్రిక్ కారు 'కియా సైరోస్ ఈవీ'పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆగస్టు 2026లో లాంచ్ కానున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర, బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, ఫీచర్లపై ఇప్పటివరకు ఉన్న వివరాలు ఇక్కడ చూసేయండి..

కియా సైరోస్ ఈవీ భారతదేశంలో విభిన్న బడ్జెట్ శ్రేణుల్లో ఉన్న కొనుగోలుదారులను ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది. టెస్టింగ్ సమయంలో లీకైన చిత్రాల ప్రకారం ఈ కారుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ...