భారతదేశం, ఏప్రిల్ 7 -- Aditya Dhar: దర్శకుడు ఆదిత్య ధర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరో చరిత్ర సృష్టించాడు. అతని దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar 2) ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ మూవీ రికార్డు స్థాయి వసూళ్లను సాధించడమే కాకుండా, విమర్శకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాను నేషనల్ అవార్డుకు ఎప్పుడూ సిద్ధమే అని ఆదిత్య ధర్ చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.

ప్రముఖ నటుడు రాజ్ జుట్షీ మేనకోడలు సంక్షిత ఈ సినిమాపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపించింది. సాధారణంగా సీక్వెల్ సినిమాలు మొదటి భాగం అంచనాలను అందుకోవడంలో విఫలమవుతుంటాయి. కానీ 'ధురంధర్ 2' ఆ అంచనాలను మించిపోయిందని ఆమె పేర్కొంది.

ఆదిత్య ధర్ ఒక అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించారని, ఆయన ఖచ్చితంగా నేషనల్ అవార్డుకు అర్హులని ఆమె రా...