భారతదేశం, సెప్టెంబర్ 11 -- 8వ వేతన సంఘం సంప్రదింపుల ప్రక్రియ వేగవంతమైంది. ఇటీవల తమిళనాడు రాజధాని చెన్నైలో ముగిసిన కీలక సమావేశాల్లో 'చెన్నై జీపీఓ పెన్షనర్ల ఫోరం' ప్రతినిధులు పలు కీలక డిమాండ్లను కమిషన్ ముందు ఉంచారు. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత సిబ్బందితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల చూపు ఇప్పుడు ఈ వేతన సంఘం తీర్పుపైనే నెలకొంది.

చెన్నై వేదికగా జరిగిన చర్చల్లో పింఛనుదారులు 8వ వేతన సంఘం ముందు ప్రధానంగా ఐదు అంశాలపై పట్టుబట్టారు:

పాత పెన్షన్ పథకం (ఓపీఎస్) పునరుద్ధరణ: దేశవ్యాప్తంగా ఉద్యోగులు సుదీర్ఘకాలంగా పోరాడుతున్న ఓపీఎస్ విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని కోరారు.

పెన్షన్, కుటుంబ పెన్షన్ పెంపు: పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా విశ్రాంత ఉద్యోగులు, ...